ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన సంచలన ప్రకటనపై టీడీపీ ఎంపీ కనకమేడల ఘాటుగా స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…. జీఎన్ రావు కమిటీకి ఎలాంటి చట్టబద్ధతా లేదని అన్నారు. అసలు ఆ కమిటీ అమరావతి రాజధాని మార్పు కోసం వేసిన కమిటీయే కాదని అన్నారు. రాజధాని రైతుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన అన్నారు.
కావాలంటే తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, అమరావతి రాజధానిని మాత్రం మార్చకూడదని కనకమేడల డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనలో చాలా దురుద్దేశాలు ఉన్నాయని తెలిపారు. ఆయన చేసిన ప్రకటనపై రైతులు ధర్నాలకు దిగితే వారిని పెయిడ్ ఆర్టిస్టులని ఎలా అంటారని కనకమేడల ప్రశ్నించారు.
ఆయుష్మాన్ భారత్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…