telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ దాడుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు: కళా వెంకట్రావు

TDP Kala write letter to Farmers

ఏపీలో వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై టీడీపీ నేత కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ సిద్ధపడిందని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వందలకు పైగా దాడులు జరిగాయని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడుల్లో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు సీఎం జగన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ మూకలు బరితెగించి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించారని విమర్శించారు.

Related posts