నియోజకవర్గానికి ఒక రీచ్ ఏర్పాటు చేసి అవినీతికి తలుపులు తెరిచారని టీడీపీ అగ్రనేత కళా వెంకట్రావు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ చూస్తుంటే నియోజకవర్గాల వారీగా ఇసుక మాఫియాను తయారుచేసినట్టుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి సహకరించేలా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇసుక అంశంపై 5 నెలల తర్వాత తీరిగ్గా కళ్లు తెరిచిందంటూ వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. రాజాంలోని తునివాడ రీచ్ లో టన్ను ఇసుక ధర రూ.550గా పేర్కొన్నారని, గతంలో అక్కడ 4 టన్నుల ఇసుక రూ.1400కే లభ్యమయ్యేదని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరాలంటే ఉచిత ఇసుక విధానం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇసుక ధర సామాన్యులు కొనేలా ఉండాలని కళా వెంకట్రావు హితవు పలికారు.
ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!