telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రస్తుతం దేశంలో మోదీ హవా.. ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు: జేసీ దివాకర్ రెడ్డి

jc-diwakar-reddy

ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తోందని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ప్రభంజనం వల్లే ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారని అన్నారు. చంద్రబాబు చేసిన కొన్ని తప్పులు, మోదీ ప్రవేశపెట్టిన పథకాలే దీనికి కారణమని చెప్పారు. జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు.

దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ ప్రభంజనం వీస్తుందని తెలిపారు. అందుకు చంద్రబాబు పాత్ర కూడా పరోక్షంగా ఉందన్నారు. తాను బీజేపీలో చేరాలనుకోవడం లేదన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Related posts