వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. వైసీపీ నేతలు మాట్లాడుతున్న భాష, వారి తీరును ఎండగడుతూ ఏదేవా చేశారు. తాడేపల్లిలో ఆశ్లీల భాష యొక్క పాఠశాల ఉందనిఇందులో ప్రిన్సిపాల్ రోజా, గెస్ట్ ఫ్యాకల్టీ బొత్స అని అభివర్ణిస్తూ ఆయన ఆయన చేసిన పోస్ట్ ఈ విధంగా ఉంది.
అశ్లీల భాష యొక్క పాఠశాల (షార్ట్ టర్మ్ కోర్సు), తాడేపల్లి
ప్రిన్సిపాల్ – రోజా గారు (తిట్లలో అనేక సంవత్సరాల ప్రావీణ్యం, అనుభవం కలదు)
హెచ్ఓడీ – కొడాలి నాని (నీ అమ్మమొగుడు అనే సర్టిఫికెట్ కోర్సు హోల్డర్)
ప్రొఫెసర్ – అనిల్ యాదవ్ (బుల్లెట్లు దింపడంలో అనుభవశీలి)
డ్యాన్స్ మాస్టర్ – అంబటి రాంబాబు (నాట్యం చేయడంలో దిట్ట. మరియు అనేక మందితో నాట్యం చేసిన అనుభవం)
గెస్ట్ ఫ్యాకల్టీ – బొత్స సత్యనారాయణ (బహుభాషా కోవిదుడు. ఏ విషయం అయినా స్పష్టంగా మాట్లాడే అనుభవం ఈయన సొంతం)
పీఈటీ – పృథ్వి రాజ్ (ఏదైనా సరే వెనక నుండి ఆకర్షించడం ఈయన ప్రత్యేకత)
మ్యాథ్స్ హెడ్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (తప్పుడు లెక్కని కరెక్ట్ గా చెప్పడంలో ఈయన మేధస్సు అమోఘమైనది)
డీన్ – సీయం జగన్ గారు (అన్ని విభాగాల్లో నైపుణ్యం ఈయన సొంతం)
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – విజయసాయిరెడ్డి (పారదర్శకంగా లెక్కలు చూపడంలో ఈయన అనుభవజ్ఞులు)
పరీక్ష విధానం – ప్రతిపక్ష పార్టీని తిట్టడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులుకు మాత్రమే. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిబంధనలు పాటిస్తున్నాం.. నిషేధంపై స్పందించిన టిక్ టాక్!