telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇది ప్రజారాజ్యమా.. నియంతల ప్రభుత్వమా?: టీడీపీ నేత గోరంట్ల

gorantla buchayya on resignation

వైసీపీ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజారాజ్యమా? నియంతల ప్రభుత్వమా? అని మండిపడ్డారు. సభలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ ను చూపించకుండా ఆపడాన్ని “టెక్నికల్ ప్రాబ్లమ్” అని వైసీపీ సభ్యులు చెబుతున్నారని దుయ్యబట్టారు.

ఎనిమిది నెలలకే భ్రష్టుపట్టిపోయిన ప్రభుత్వం ఇదని, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, మీడియాపై కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు బూతులు మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టరా? తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టరా? అంటూ విరుచుకుపడ్డారు.

శాసనమండలిలో మైనార్టీ నాయకుడిపై వైసీపీ నేతలు వాడిన భాషను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం వైసీపీ ప్రభుత్వం నడవడం లేదని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని అమరావతి తరలింపు అనేది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య అని అన్నారు.

Related posts