రాజమండ్రి జైల్లో ఉన్న దళితనేత, మాజీ ఎంపీ హర్షకుమార్ను టీడీపీ నేతలు చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలుపరామర్శించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ దళిత నేతలను జైల్లో పెట్టి వైసీపీ నేతలు ఆనందిస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని విమర్శించారు. ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీసేందుకు గందరగోళం సృష్టిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి భూములు కొన్నారని గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు.