చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రానికి కంపెనీలు వచ్చాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గుజరాత్కు వెళ్లాల్సిన కియా కంపెనీ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. వైసీపీ కొత్త ప్రభుత్వం వచ్చాక విత్తన కంపెనీలు మూతబడ్డాయని గోరంట్ల ఆరోపించారు.
బడ్జెట్లో విద్యాశాఖకు గతం కంటే తక్కువ నిధులు కేటాయించారని, నిధులు తగ్గించి ఏవిధంగా స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. 45 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్లు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరణ చేస్తామని చెప్పి, వారిని ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీసు వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని గోరంట్ల దుయ్యబట్టారు.