telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ గూటికి మాజీ మంత్రి గంటా..?

Ganta srinivas tdp

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు ముగిశాయని అంటున్నారు. వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా చెపుతున్నారు.

ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజున వైసీపీలో గంటా చేరనున్నట్టు సమాచారం. మరోవైపు గంటా చేరికపై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts