తెలంగాణ టీడీపీ మీడియా కార్యదర్శి జి.ప్రకాశ్ రెడ్డి తండ్రి, మాజి ఎంఎల్సి రామ్ రెడ్డి మంగళవారం కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన టిడిపి అధినేత చంద్రబాబు రామ్ రెడ్డి మఅతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. రామ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ … ‘ తెలుగుదేశం తెలంగాణ పార్టీ మీడియా కార్యదర్శి జి.ప్రకాష్ రెడ్డి తండ్రి, శాసనమండలి మాజి సభ్యులు తెలంగాణ జి.రామ్ రెడ్డి మఅతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. శత వసంతాల జీవితంలో ప్రజాసేవ కే రామ్ రెడ్డి అంకితమయ్యారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను ‘ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.