వైసీపీ నేతలే రాష్ట్రంలో గొడవలు చేసి వాళ్లే గవర్నర్కు ఫిర్యాదు చేశారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపించారు.గవర్నర్ నరసింహన్ దగ్గర వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. జగన్ మీడియా సమావేశంపై స్పందించిన ఆయన మే 23న హీరో ఎవరో, విలన్ ఎవరో తేలుతుందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఈసీకి కనిపించడంలేదా? అని డొక్కా ప్రశ్నించారు. కేంద్రం, ఈసీ, జగన్ మధ్య లోపాయకారి ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించే వరకు చంద్రబాబు పోరాటం ఆగదని డొక్కా తేల్చి చెప్పారు.