వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. కొట్టేయడంలో మీరు పీహెచ్డీ చేశారంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. ప్రజావేదికను హెరిటేజ్ సొమ్ముతో కట్టారా? అన్న విజయసాయి వ్యాఖ్యలకు నిరసనగా ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ఇంటి ముందు 1.3 కి.మీ మేర రోడ్డు వేసేందుకు రూ.5 కోట్లను భారతి సిమెంట్స్ నుంచి ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు.
జగన్ ప్యాలెస్ వద్ద బారికేడ్ల నిర్మాణానికి రూ.75 లక్షలను కార్మెల్ ఏషియా చెల్లించిందా? అంటూ దివ్యవాణి విరుచుకు పడ్డారు. అలాగే జగన్ నివాసం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలను జగతి పబ్లికేషన్స్ నుంచి ఖర్చు చేశారా? అని నిలదీశారు. మీ రికార్డులు మీరే తిరగ రాస్తున్నారని దివ్యవాణి తన పోస్టులో పేర్కొన్నారు.
చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడు: ఏపీ మంత్రులు