టీడీపీ అధికార ప్రతినిధి, నటి దివ్యవాణి ఆ పార్టీని వీడుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా వేధికగా అనేక వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో దివ్యవాణి స్పందించారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన తుదిశ్వాస వరకూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే వారే నిజమైన నాయకులని దివ్యవాణి వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.