వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. వైయస్సార్ మద్యం పథకం కింద వైసీపీ నేతలు అధిక ధరలకు మందు అమ్ముతున్నారని ఆరోపించారు. ఏడాదికి రూ. 3 వేల కోట్ల జేట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.మాజీ మంత్రి వైసీపీ నేత వసంత నాగేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ గుట్ట, పురగుట్ట స్థలాలను రద్దు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పేదల కడుపు కొట్టే పనులు చేయవద్దని హితవు పలికారు. తింగరి వేషాలు మానుకోవాలని పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.