telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇది మంత్రులు మాట్లాడాల్సిన భాషేనా: దేవినేని ఫైర్

uma devineni

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిల్ సమాధానం చెప్పలేక.. చంద్రబాబు, టీడీపీ నేతలను తిట్టి పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. మైండ్‌ దొబ్బిందా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇది మంత్రులు మాట్లాడాల్సిన భాషేనా అని దేవినేని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం పోలవరంకు ఖర్చు చేసిన రూ.5,500 కోట్లును వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎందుకు తెచ్చుకోలేకపోతుందని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నీ యమ్మ మొగుడు కట్టాడా? అని బూతుల మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారని, డిక్లరేషన్‌ ఎవడికివ్వాలని అంటున్నారని విమర్శించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి సీఎం జగన్ మంత్రులతో మాట్లాడిస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు.

Related posts