telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిది: దేవినేని

devineni on power supply

వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తుంటే.. ఏపీలో ఎమ్మెల్యేలు తర్వాత సీఎం ఎవరని చర్చించుకుంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో ఏ శాఖలో సరిగా పనులు జరగడంలేదని, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో తిరుగులేని మెజారిటీ సాధించిన జగన్ ఇంత త్వరగా ఎంపీలపై పట్టు ఎందుకు కోల్పోతున్నారన్న అంశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లోనూ విస్తృతమైన చర్చ జరుగుతోందన్నారు.

Related posts