telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతిని చంపేస్తారు: దేవినేని

devineni on power supply

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతిని చంపేస్తారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోతే మంత్రులు రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా లేఖలు ఇవ్వాలని, ఎమ్మెల్యేలు పదవులు వదులుకోవాలని సీఎం జగన్ వ్యాఖ్యలు ఆయనలోని అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయని చెప్పారు.

ఓడిపోతామనే భయం జగన్ కు పట్టుకుందనిఅందుకే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు బెదిరింపులు పంపారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అహంకారంతో రాజధాని విషయంలో మూడు ముక్కలాటను జగన్ ఆడుతున్నారని దేవినేని మండిపడ్డారు. 

Related posts