టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్ష ప్రారంభించిన విషయాన్ని ఉమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి పుణ్యస్థలంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రజా రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ఉమ ట్విట్టర్ లో పేర్కొన్నారు.