telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేవినేని ఉమ.. 24 గంటల నిరసన దీక్ష!

uma devineni

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఆయన దీక్ష ప్రారంభించిన విషయాన్ని ఉమ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి పుణ్యస్థలంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రజా రాజధానిగా అమరావతిని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని ఉమ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts