అధికార వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి మండిపడ్డారు. టీడీపీ నేతలపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి… సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ పై ఎందుకు ట్వీట్ చేయలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిసి ఏం అడుక్కున్నారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బెయిల్ పై తిరుగుతున్న విజయసాయి తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నీలాగా 16 నెలల జైలు జీవితం గడపలేదు, డబ్బు దోచుకోలేదు.. నీవా నన్ను బెదిరించేది అంటూ దేవినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బందరు పోర్టును తెలంగాణకు ఎంతకు అమ్మేశారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని దేవినేని ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే బందరు పోర్టులో పని చేస్తున్న యంత్రాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడి నిర్మాణ సంస్థ వెళ్లిపోయిందని చెప్పారు. క్విడ్ ప్రోకో సంస్థకు బందరు పోర్టును జగన్ ప్రభుత్వం ఇచ్చేసిందని ఆరోపించారు. బందరు పోర్టుపై సీఎం జగన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ స్వలాభం కోసమే జగన్తో కేసీఆర్ దోస్తీ: డీకే అరుణ