telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల బాంబులకు భయపడలేదు..నీచ రాజకీయాలకు బలయ్యారు: దేవినేని

uma devineni

గుంటూర్ జిల్లా నరసరావుపేటలో సోమవారం మాజీ స్పీకర్ కోడెల సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ.. కోడెల బాంబులకు భయపడలేదని.. నీచ రాజకీయాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులపై కలత చెందారన్నారు.

కోడెలను వేధిస్తూ విజయసాయిరెడ్డి రోజూ ట్వీట్లు పెట్టారని పేర్కొన్నారు. తమను కూడా హెచ్చరించారని దేవినేని ఉమ స్పష్టం చేశారు. కోడెల మృతితో జగన్ ప్రభుత్వం సాధించిందేంటని ప్రశ్నించారు. వైఎస్ చనిపోయాక 9నెలల పాటు అధికారిక నివాసంలో.. జగన్ కుటుంబం ఎందుకు ఉందో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

Related posts