telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని

uma devineni

ఏపీ రాజధాని అమరావతి పై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజధాని మార్పుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ రాసిన లేఖను బయటపెట్టాలనిదేవినేని ఉమ డిమాండ్ చేశారు.

అమెరికాకు వెళ్లిన జగన్ రాజధానిపై అనుమానాలు కలిగే విధంగా మంత్రి బొత్సతో వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. ప్రధానికి అమరావతిపై రాసిన కాన్ఫిడెన్షియన్ లేఖ సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ఒక కులానికి సంబంధించి ఎనభై ఐదు శాతం లబ్ధి పొందారు కనుక, రాజధాని అమరావతిని తరలిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని వార్తలు వస్తున్నాయని అన్నారు. కేంద్రానికి రాసిన కాన్ఫిడెన్షియన్ లేఖను బయటపెట్టాలని దేవినేని డిమాండ్ చేశారు.

Related posts