telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిని ఎప్పుడో నోటిఫై చేశారు: దేవినేని

devineni uma disappointed on utsav arrangements

రాజధానిగా అమరావతిని ఎప్పుడో నోటిఫై చేశారని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ పటంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించిందన్నారు. రాజధానిపై నిర్ణయం రాష్ట్ర పరిధిలో ఎప్పుడో జరిగిపోయిందని, ఇది ముగిసిన అధ్యాయం అని దేవినేని వ్యాఖ్యానించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు.

జనవనరుల మంత్రిపై దేవినేని విమర్శలు గుప్పించారు. రివర్స్ పాలనలో నీటిని రివర్స్ తీసుకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. గోదావరిని తెలంగాణ భూభాగం నుంచి తరలించాల్సిన అవసరం ఏముందని దేవినేని ప్రశ్నించారు. అజయ్ కల్లం, సజ్జల రామకృష్ణారెడ్డి సూడో మేధావులు అంటూ విమర్శలు చేశారు.

Related posts