మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
వైసీపీ అడిగిన బూత్లలోనే రీపోలింగ్ జరపడంపై అనుమానం వ్యక్తంచేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండు చోట్ల రీపోలింగ్కు టీడీపీ డిమాండ్ చేస్తోంది. తాము అడుగుతున్న ప్రాంతాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని కోరింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూత్లలో రీపోలింగ్ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఈరోజు మరోసారి టీడీపీ నేతలు ఈసీని కలవనున్నారు.