telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తమపై దాడులు చేస్తున్నారు.. వైసీపీ పై టీడీపీ ఫిర్యాదు

TDP Change Puthalapattu Candidate

నెల్లూరు జిల్లాలోని టీడీపీ నేతలు వైసీపీ పై జిల్లా ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు బుధవారం జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.

జిల్లాలోని టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లాలో ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం దారుణం అని అన్నారు. ఇతర పార్టీల నేతలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే తప్పా? కార్యకర్తలకు మేము అండగా నిలుస్తామని తెలిపారు. వైసీపీతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.

Related posts