టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు స్ర్కీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధిని టీడీపీ మార్చింది. బుధవారం నుండి ఆచూకీ లేకుండా పోయిన పూర్ణం స్థానంలో మాజీ ఎమ్మెల్యే లలితా థామస్కి పూతలపట్టు టీడీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. మరోవైపు దర్శిలో కదిరి బాబురావుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేక రావడంతో శిద్దా రాఘవరావు కుమారుడి పేరును స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది. కానీ చివరకు కదిరి బాబురావు వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు.
ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న బుడ్డా రాజశేఖర్ స్థానంలో మరో అభ్యర్థి ఎంపికపై ఈ కమిటీలో చర్చ జరిగింది. తనకు ఆరోగ్యం బాగా లేనందున చికిత్స కోసం వెళ్తే తనపై తప్పుడు ప్రచారం చేశారని పూర్ణం గురువారం నాడు ప్రకటించారు. పూర్ణం అభ్యర్థిత్వాన్ని స్తానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పూర్ణం స్థానంలో లలితా థామస్ను టీడీపీ గురువారం నాడు ప్రకటించింది.