telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రామ జపం వదిలి నా జపం.. వైసీపీపై చంద్రబాబు విమర్శలు

chandrababu

వైసీపీ సభ్యులు శాసనసభలో రామ జపం వదిలి నా జపం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. మంగళగిరిలో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ సభలో వైసీపీ ఎమ్మేల్యేలు తన పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం లేదని, ‘చంద్ర జపం’ చేస్తున్నారని విమర్శించారు. మీకు తమాషాగా ఉంది, హుందాతనం లేని అసెంబ్లీలో కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టింది కక్ష సాధింపు చర్యల కోసం కాదన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఎటువంటి మంచి చేయకుండా, కేవలం, ‘స్లోగన్స్’తో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విమర్శించారు. ‘రివర్స్ టెండరింగ్’ పేరిట ఓ ఐదారు కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు.

Related posts