telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలి: చంద్రబాబు

పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అన్న క్యాంటీన్ వంటి పథకాలను పునరుద్ధరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది తమ పార్టీ ప్రధాన లక్ష్యం అని అన్నారు.

నాటి కిలో రూ.2 బియ్యం పథకం నుండి నిన్నటి ‘అన్న క్యాంటీన్’ వరకు టీడీపీ పథకాలన్నీ ఈ లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని అన్నారు. కేవలం, టీడీపీ పథకాలు అన్న కారణంగా వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని పేదలను విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పేదలకు ఆహారభద్రత కల్పించాలని సూచించారు.

Related posts