telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇప్పటికైనా పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోండి: చంద్రబాబు

chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే బెట్టింగులు నిర్వహించినంత సులభమని కొందరు మేధావులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.లవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయి. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలవనరుల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుంది.

ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారు. ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారు. గోదావరి నదికి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే అధికారులు అప్రమత్తం చేశారు. మరి ఈ మేధావులు ఇన్నాళ్ళూ ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోండిని చంద్రబాబు ట్విట్టర్ లో హితవు పలికారు.

Related posts