telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ సర్కారుకు చంద్రబాబు వార్నింగ్

chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారు పై నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నలను గృహనిర్బంధం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. ధర్నాచౌక్ కు వెళ్లకుండా తమ నాయకులను అడ్డుకోవడం ఏం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.

నిరంకుశ పాలన, అణచివేత విధానాలకు వైసీపీ సర్కారు భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కనీసం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని నిలదీశారు. ఐదేళ్లు సాఫీగా సాగే రాజధానిని వివాదం పాలుచేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని గ్రామాల ప్రజలను వేలాది పోలీసుల సాయంతో భయాందోళనలనకు గురిచేస్తున్నారని, ప్రజాగ్రహంలో జగన్ వంటి నియంతలు కూడా కొట్టుకుపోతారని అన్నారు.

Related posts