telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు భద్రత తగ్గింపుపై కేంద్రానికి లేఖ: బుద్ధా వెంకన్న

budda venkanna fire on ap govt

టీడీపీ అధినేత చంద్రబాబుకు లోకేశ్‌కు భద్రత తగ్గింపుపై కేంద్రానికి లేఖ రాస్తామని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.కలియుగ అభిమన్యుడు లోకేష్‌పై 1000 మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై లోకేశ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులకు బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అంత భద్రత అవసరమా అని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

Related posts