telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బాలికను దత్తత తీసుకుని చదివిస్తాం: చంద్రబాబు

chandrababu

రాజమండ్రిలో దళిత బాలిక అత్యాచారానికి గురైన ఘటన పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి తెలుగుదేశం తరపున తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ ఘటనపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు.

కమిటీ సభ్యులు నిన్న రాజమండ్రికి వెళ్లి బాధితురాలని పరామర్శించారు. అనంతరం నివేదికను చంద్రబాబుకు అందించారు. బాలిక పదో తరగతి వరకు చదువుకుందని చంద్రబాబుకు టీడీపీ నేతలు చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, బాలికను దత్తత తీసుకుని చదివిస్తామని చెప్పారు. టీడీపీ అండగా ఉంటుందనే భరోసాను ఆమెకు కలిగించాలని అన్నారు.

Related posts