telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలదే బాధ్యతాయుతమైన పాత్ర: చంద్రబాబు

chandrababu

భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆకాంక్షలను ప్రతిఫలింపజేయడంలో పత్రికలు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా వివిధ మీడియా సంస్థల అధినేతలకు, పాత్రికేయులకు, పత్రికా రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ట్విట్టర్ లో స్పందించారు.

ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తోందని, అందుకే తాము జీవో 938, జీవో 2430కి వ్యతిరేకంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. స్వేచ్ఛగా, నిర్భయంగా తమ విధులను నిర్వర్తించే పత్రికలను కట్టడి చేసేందుకు తీసుకువచ్చిన జీవో 2430ని రద్దు చేసి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts