విధి నిర్వహణలో భాగంగా పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు ఆ నగర అధికారులు ప్రకటించారు.
మరోవైపు చెన్నైలోనూ పలువురు జర్నలిస్టులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో వారికి జాగ్రత్తలు చెబుతూ చంద్రబాబు పలు ఫొటోలు పోస్ట్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీరు వారధిలాంటివారు. కరోనా నేపథ్యంలో మీతో పాటు మీ కుటుంబం పట్ల మీరు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని తెలిపారు. చాలా మంది జర్నలిస్టులకు కొవిడ్-19 సోకడం ఆందోళన కలిగిస్తోంది’ అని ట్వీట్ చేశారు.