telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోట్ల విలువైన భూములపై వైసీపీ కన్నేసింది: చంద్రబాబు

chandrababu

కోట్ల విలువైన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భూములు కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన రూ. 1.30 లక్షల భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, ‘మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయని తెలిపారు.

సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు.అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువ చేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారని తెలిపారు.

Related posts