telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు హైదరాబాద్ కు చంద్రబాబు..తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ!

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు.ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకొనున్నారు. అనంతరం తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి స్థానిక నాయకత్వం చేపడుతున్న చర్యలపైనే ఈ భేటీ జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న ఈ సమావేశానికి పలువురు పార్టీ నేతలు హాజరు కానున్నారు.

కాగా, గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ, నామమాత్రపు ప్రభావాన్ని కూడా చూపించలేక పోయింది. ఆపై పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోల్పోయిన తరువాత, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

Related posts