telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐదు వేలతో గోనె సంచులు మోసే ఉద్యోగమా!: చంద్రబాబు ఫైర్

chandrababu

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామ వాలంటీర్ల ఉద్యోగ నియామకాల పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లతో పెద్ద ప్రమాదం వచ్చి పడిందని ఆరోపించారు. తూర్చుగోదావరి జిల్లా కాట్రేని కోనలో ఓ మహిళపై గ్రామవాలంటీర్ ప్రవర్తన కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన నిప్పులు చెరిగారు. అసలు, వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా కావాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు.

ఐదు వేల రూపాయలతో గోనె సంచులు మోసే ఉద్యోగమా అని దుయ్యబాట్టారు. ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చేశామని మాట్లాడతారా? అని వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.గ్రామ వాలంటీర్లు ఎప్పుడు పడితే అప్పుడు ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని డిస్టర్బ్ చేస్తున్నారని విమర్శించారు. .ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకోమని, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదనివైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఉపేక్షించదని స్పష్టం చేశారు.

Related posts