telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక కొరత పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

chandrababu

ఏపీలో ఇసుక కొరత నెలకొందంటూ టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. దేన్నయినా సహిస్తాం కానీ, పేదల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరుగుతుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదని ట్వీట్ చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షల మంది పేదవాళ్లు ఉపాధి కోల్పోయారని మండిపడ్డారు. చివరికి వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసి నిలువ నీడలేకుండా చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts