టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.విజయవాడ నుంచి హైదరాబాదుకు రోడ్డు మార్గంలో ఆయన వస్తుండగా కాన్వాయ్లోని వాహనానికి ప్రమాదం జరిగింది. ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్లోని వాహనాలు ఢీకొన్నాయి. ఈ క్రమంలో కాన్వాయ్ లోని రెండు, మూడు వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. స్వల్పగాయాలతో మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లింది. ప్రమాదంలో చంద్రబాబు కు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాదు వైపు కదిలింది.
చంద్రబాబు కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు: విజయసాయిరెడ్డి