telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వంద రోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలన పై వైసీపీ నేతలు జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వందరోజుల పాలనలో ఏ ఒక్కపనీ చేపట్టలేదని విమర్శించారు. ఏపీలో ఉంది తీవ్రవాద ప్రభుత్వమని పారిశ్రామికవేత్తలు అనేలా చేశారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు భద్రతతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రేపు పోలవరానికి ఏమైనా జరిగితే గోదావరి జిల్లాలు ఏమవుతాయి? అని ప్రశ్నించారు. వైసీపీ వందరోజుల పాలన ఏపీకి ఓ శాపంగా అభివర్ణించారు. తోట త్రిమూర్తులు పార్టీని వీడే విషయం గురించి మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. స్వలాభాల కోసం టీడీపీని వీడుతూ తనపై అపవాదులు వేయడం సరికాదని హితవు పలికారు.

Related posts