telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు

chandrababu gift on may day

టీడీపీ అధినేత. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క అవకాశమంటూ సీఎం వైఎస్ జగన్ అందలమెక్కిన మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. రాజధాని అమరావతి కాన్సెప్ట్ నే చంపేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు.

రాజధాని అమరావతి ప్రాంతాన్ని దెబ్బతీయడంతో ఇక్కడి వాళ్లు ఉపాధి కరువై హైదరాబాద్ కు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని అన్నారు. రైతుల త్యాగాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. తన హయాంలో మిగులు విద్యుత్ ఇస్తే, ఇప్పటి ప్రభుత్వం మాత్రం విద్యుత్ కోతలు విధిస్తోందని అన్నారు.

Related posts