telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి ఉద్యమంలో అల్లూరి స్ఫూర్తిని అందుకోవాలి: చంద్రబాబు

chandrababu

అమరావతి రైతుల ఉద్యమం నేడు 200 రోజులకు చేరుకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళదామని చెప్పారు. అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలన్నారు.

మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈ రోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్లం కాదు. స్వాతంత్ర్య అమర వీరుల్లో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారన్నారు.

ప్రజలకు ద్రోహం చేసే పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుందని పేర్కొన్నారు.

Related posts