వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ లో మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా బుద్ధా వెంకన్న మరికొన్ని వ్యాఖ్యలతో వరుస ట్వీట్లు చేశారు. మీకు 22 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్ర హక్కుల కోసం పోరాడకుండా, కేసుల మాఫీ కోసం ఏపీ హక్కుల్ని తాకట్టు పెట్టేశారు కదా శకుని మామా! అంటూ వ్యంగస్త్రాలు సంధించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ, అప్పులూ అంటూ మంగళారం కబుర్లొకటి!” అంటూ సెటైర్ వేశారు. మడమ తిప్పాం, మాట తప్పాం అని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, “మహామేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు సృష్టించిన సంపదపై నేను చర్చకు సిద్ధం, మరి నువ్వు సిద్ధమా శకుని మామా?” అంటూ సవాల్ విసిరారు.