telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన బుద్ధా వెంకన్న

ycp jagan with malya meeting said budda

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు విజయవాడలో వాడి వేడిగా జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గైర్హాజరయ్యారు. మరోవైపు ఈ సమావేశంలో విజయవాడ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే మూడు సార్లు టీడీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తాను మరోసారి ఆ బాధ్యతలు స్వీకరించబోనని ప్రకటించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నగర బాధ్యతలను ఎవరికి అప్పగించినా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అనంతరం సమావేశం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కృష్ణా జిల్లా నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts