telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీరంగనీతులు చెబుతావా.. విజయసాయిపై బుద్ధా ఫైర్

budda venkanna fire on ap govt

చేసిన చెత్తపనులు సరిపోనట్టు శ్రీరంగనీతులు చెబుతావా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు శాసనమండలిలోనే ఉండి, తన స్వార్థం కోసం రాజధానిని విభజించాలని చూస్తున్నారని, తోడుదొంగలను రంగంలోకి దింపి ఎమ్మెల్సీలను కొనాలని చూశారని విమర్శించారు.

చివరికి సంతలో పశువుల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొన్నారని వ్యాఖ్యానించారు. మండలి సిబ్బందిని కూడా మేనేజ్ చేసి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తామిచ్చిన నోటీసును పక్కనబెట్టించి నాటకాలు ఆడారని బుద్దా ఆరోపించారు. మండలి చైర్మన్ మీ దొంగ పనులు గమనించి ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఆయనపై రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు.

Related posts