telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భూముల అక్రమాలపై సిట్ విచారణ జరిపించాలి: బుద్దా వెంకన్న

ycp jagan with malya meeting said budda

విజయసాయిరెడ్డికి దమ్ముంటే జగన్ పాలన వచ్చిన తర్వాత విశాఖలో చోటుచేసుకున్న భూముల అక్రమాలపై సిట్ విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. విశాఖపట్టణంలో బినామీలతో కలసి సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలు 500 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో కేంద్రం వద్ద మెడలు వంచి విజయసాయిరెడ్డి చక్కబెట్టిన వ్యవహారం విశాఖలో భూములను చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇప్పడు అదే చోట రాజధాని రాబోతోందని విమర్శించారు. రాజధాని ప్రకటన వెలువడక ముందే రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టి భూములను అగ్రిమెంట్ చేసుకున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

Related posts