telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను: బుద్ధా వెంకన్న

budda venkanna fire on ap govt

నాయకుడిని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. . తాజాగా తన ఆరోగ్యంపై ట్వీట్ చేస్తూ ‘నా ప్రత్యక్ష దైవం, చంద్రబాబు గారు ఇచ్చిన దైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి త్వరగా కోలుకున్నాను. పదవులు శాశ్వతం కాదని పేర్కొన్నారు.

కొవిడ్-19 టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బుద్ధా వెంకన్న ఆగస్టు 28న ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారని, ఈ 14 రోజులు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన అప్పట్లో ప్రకటించారు. అప్పటి నుంచి ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. తాజాగా కష్ట కాలంలో చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

Related posts