telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొడాలి నాని ఒక బూతుల మంత్రి: బోండా ఉమ

tdp leader uma on parlament session speech

ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. కొడాలి నాని ఒక బూతుల మంత్రి అని విమర్శించారు. బూతులకు కూడా ఒక మంత్రిని పెడతారా? అని ప్రశ్నించారు.

తమ హయాంలో రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులతో పాటు పలు భవనాలను నిర్మించామని చెప్పారు. వైసీపీ మాత్రం రాజధానిని శ్మశానంలా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు.అమరావతిని 150 వైసీపీ పశువులు నాశనం చేస్తున్నాయని అన్నారు. అమరావతిని శ్మశానంతో పోల్చుతూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.

Related posts