టీడీపీ నేత, కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య కర్నూలులోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య, కుమార్తె కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్లిన సమయంలో బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. విషయాన్ని గమనించిన స్థానికులు ఆయనను రక్షించారు.
అనంతరం ఆయనను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. బంగి అనంతయ్య ఆత్మాహత్యాయత్నం చేశారనే వార్తతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యాయి. రాజకీయంగా తనను అందరూ మోసం చేశారనే ఆవేదనతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది.