telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖలో టీడీపీకి షాక్…భార్యతో కలిసి వైసీపీలోకి సన్యాసిపాత్రుడు?

sanyasipatrudu tdp

విశాఖపట్నంలో టీడీపీ కి మరో షాక్ తగిలింది.  30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన భార్య అనితతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని సన్నిహితవర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయి.అవి ఇటీవలి కాలంలో మరింత తీవ్రతరం కావడంతో సన్యాసిపాత్రుడు, ఆయన భార్య అనిత వైసీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

నేడు నారా లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలోనే సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనుండటం గమనార్హం. సన్యాసి పాత్రుడిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ శ్రేణులు కూడా ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సోదరుడు అయ్యన్న పాత్రుడు టీడీపీలో ఉన్నప్పటికీ తాను మాత్రం వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Related posts