telugu navyamedia
Uncategorized

జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది: అయ్యన్నపాత్రుడు

ayyannapatrudu on tdp drastic loss

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థలో కూడా రౌడీయిజం పెరిగిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నప్పటికీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారు.

దొంగతనం అంటగట్టి కోడెలను మానసిక క్షోభ అనుభవించేలా చేశారని మండిపడ్డారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని చెప్పారు.విశాఖపట్టణం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, ఇలాంటి ప్రాంతంలోకి కడప సంస్కృతిని తీసుకురావద్దని అన్నారు. పెన్షన్లు మినహా అన్నింటినీ రద్దు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 

Related posts